పండిత్ జవహర్ లాల్ నెహ్రు జయంతి వేడుకలు

0 1,311

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నగరంలోని ఖిల్లా ప్రాంతంలో గత ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భారత మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ జయంతి వేడుకులు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర  పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రధానోపాధ్యాయులు గంగాధర్ మాట్లాడుతూ జవహర్ లాల్ కు పిల్లలంటే చాలా ఇష్టమని తెలిపారు. అదుకనే  ఆయన  జయంతి రోజును చిల్డ్రన్స్  దే గా  జరుపుకుంటారని తెలిపారు. పాఠశాలలో నిర్వహించిన  సాంస్కృతిక కార్యక్రమాలు  అలరింపజేశాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బిజెపి నాయకులు సర్దార్ బాబీ సింగ్, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Pandit Jawahar Lal Nehru Jayanti Celebrations

Leave A Reply

Your email address will not be published.