బతుకమ్మ, ఏర్గట్ల : మండలంలో ఆదివారం పలు బాధిత కుటుంబాలను బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు. ఏర్గట్ల గ్రామం లో నేరెళ్ల నర్సారెడ్డి తండ్రి నేరళ్ల భూమన్న కొన్ని రోజుల క్రితం మరణించారు. వారి కుటుంబాన్ని, గడ్డం గంగారెడ్డి కుమారుడు కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ దగ్గర కారు యాక్సిడెంట్ లో వెన్నుముకకు దెబ్బ తగిలిన విషయాన్ని తెలుసుకొని గడ్డం గంగారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దేవ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్, ఆడెం గంగ ప్రసాద్, ఏలేటి మోహన్ రెడ్డి, గడ్డం జీవన్ రెడ్డి, మూస్కు మోహన్ రెడ్డి,బద్దం లింగారెడ్డి, పన్నాల నర్సారెడ్డి, తాళ్ల రాంపూర్ బెజ్జారపు బాను, పాకాల ప్రసాద్ గౌడ్, కల్లెడ పురుషోత్తం, మేకల సాయన్న, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
