బతుకమ్మ, భిక్కనూరు : కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ తెలిపారు. నూతనంగా ఎన్నికైన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి ఆదివారం షబ్బీర్ ఆలీని అదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ నియమించడం పట్ల మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయలని షబ్బీర్ ఆలీ సూచించారు.
