నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిబంధనలను ఉల్లంఘించి రాత్రివేళ దుకాణాన్నితెరిచి ఉంచిన వ్యాపారికి న్యాయస్థానం రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో రఘుపతి మంగళవారం తెలిపారు. ఈనెల 6వ తేదీన నిర్ణీత సమయం తరువాత రాత్రి నగరంలోని దేవీరోడ్డులో ఉన్న శివశక్తి ఐస్ క్రీం షాపును తెరిచి ఉంచగా యజమాని సువాక్ రమేశ్ పై కేసు నమోదు చేసి మంగళవారం స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి నూర్జహాన్ ఎదుట హాజపర్చామన్నారు. సదరు వ్యాపారికి న్యాయమూర్తి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీరుపు వెలువరించగా, అతడిని జైలుకు పంపించామన్నారు.
