ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి గ్రామంలో బుధవారం ఉదయం ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసి,ముగ్గును పోయడం జరిగింది అని ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పేదోడి సొంత ఇంటి కళను సహకారం అవుతుందని,ఎమ్మెల్యే మదన్మోహన్ రావు కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో కురుమ సాయిబాబా తో పాటు మైదపు శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు.
