భీంగల్, బతుకమ్మ :
భీంగల్ మండల పాస్టర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా, శాంతియుతంగా ఎన్నుకొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల పాస్టర్ పెద్దలు హాజరైన ఈ ఎన్నికల్లో నూతన గౌరవ అధ్యక్షులు పాస్టర్ డి సామెల్ ను, అధ్యక్షుడిగా బోయిడి సుధాకర్, ఉపాధ్యక్షులుగా పాస్టర్ మోహన్, పాస్టర్ పాల్ లను, ప్రధాన కార్యదర్శిగా పాస్టర్ ఫిలోమోన్ ,సహాయ కార్యదర్శిగా పాస్టర్ టైటాస్, కోశాధికారి పాస్టర్ నెల్సన్, గౌరవ సలహాదారులుగా పాస్టర్ డేవిడ్, పాస్టర్ జీవరత్నం లను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సభలో పాల్గొన్న పాస్టర్లు అభినందించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ, పాస్టర్ల సంక్షేమం కోసం సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని, ఐక్యతతో సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి మంచి సందేశం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలాగే క్రైస్తవ సమాజ అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక విలువల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాస్టర్లు, మండల పాస్టర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
