మద్నూర్, బతుకమ్మ:
మద్నూర్ ఎస్సై గా మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ గత కొన్ని రోజులుగా ఎస్సైగా పని చేసిన రాజు బిచ్కుంద కు బదిలీపై వెళ్లగా, బిచ్కుంద లో ఎస్సై గా పని చేసిన మోహన్ రెడ్డి ని ఉన్నతాధికారులు మద్నూర్ కు బదిలీ చేశారు. పేకాట, అక్రమ ఇసుక రవాణా జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామని ఎస్సై సూచించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం కలిసికట్టుగా పనిచేయాలన్నారు.
