. . . కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు
. . . ఈ నెల 14న బెయిల్ పై విచారణ
హైదరాబాద్, బతుకమ్మ :
తనపై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కేంద్రమంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం బండి భగీరథ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈనెల 8న బండి సాయి భగీరథ్ పై పేట్ బషిరాబాద్ పోలిస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. పోక్సో కేసులో పోలిసులు అరెస్టు చేయకుండా ముందస్ధు బేయిల్ ఇవ్వాలని కోరారు. రాజకీయ కక్ష సాధింపు చర్యమలతో బాగంగానే కేసు నమోదు జరిగిందని పిటిషన్ లో పెర్కోన్నారు. బండి సాయి భగీరథ్ పిటిషన్ పై న్యాయస్థానం సానుకులంగా స్పంధించి ఈ నెల 14న పూర్తి స్థాయి విచారణ చెపట్టనుంది. పోక్సో కేసు నమోదు తరువాత బండి భగీరథ్ అబ్ స్కాండింగ్ లో ఉన్నారని పోలీసులు తెలిపారు.
