- మల్టీ జోన్–1 పరిధిలో పలువురు సీఐల బదిలీ
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి టౌన్ ఎస్హెచ్వోగా బి.నరహరి నియమితులయ్యారు. ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న చంద్రశేఖర్రెడ్డిని ఐజీ ఆఫీస్కు అటాచ్ చేశారు. మల్టీ జోన్ –1పరిధిలో ఏడుగురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ మల్టీ జోన్–1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐజి కార్యాలయంలో వెయిటింగ్లో ఉన్న ప్రభాకర్ను నార్నూల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బదిలీ చేశారు. అక్కడ పని చేస్తున్న రహీమ్ పాషాను రామగుండం కమిషనరేట్ వీఆర్కు అటాచ్ చేశారు. వెయిటింగ్లో ఉన్న మాధవి ప్రసాద్ను ఉట్నూర్ సర్కిల్ కు బదిలీ చేసి.. అక్కడ పనిచేస్తున్న జి.మురళిని నిర్మల్ డీసీఆర్బీకి బదిలీ చేశారు. రామగుండం వీఆర్లో ఉన్న భీమేశ్ను రామగుండం ఎస్బీ సీఐగా నియమించారు. బదిలీ అయిన అధికారులు నూతన పోస్టింగుల్లో చేరాలని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులో పేర్కొన్నారు.
