Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 June 2025, 7:42 pm Posted by : ramakrishna

కామారెడ్డి టౌన్ ఎస్ఎచ్ఓగా బి.నరహరి

  • మల్టీ జోన్​–1 పరిధిలో పలువురు సీఐల బదిలీ

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి టౌన్​ ఎస్​హెచ్​వోగా బి.నరహరి నియమితులయ్యారు. ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న చంద్రశేఖర్​రెడ్డిని ఐజీ ఆఫీస్​కు అటాచ్​ చేశారు. మల్టీ జోన్​ –1పరిధిలో ఏడుగురు ఇన్​స్పెక్టర్లను బదిలీ చేస్తూ మల్టీ జోన్​–1 ఐజీ చంద్రశేఖర్​రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐజి కార్యాలయంలో వెయిటింగ్​లో ఉన్న ప్రభాకర్​ను నార్నూల్​ సర్కిల్​ ఇన్​స్పెక్టర్​గా బదిలీ చేశారు. అక్కడ పని చేస్తున్న రహీమ్​ పాషాను రామగుండం కమిషనరేట్​ వీఆర్​కు అటాచ్​ చేశారు. వెయిటింగ్​లో ఉన్న మాధవి ప్రసాద్​ను ఉట్నూర్​ సర్కిల్ కు​ బదిలీ చేసి.. అక్కడ పనిచేస్తున్న జి.మురళిని నిర్మల్ డీసీఆర్బీకి బదిలీ చేశారు. రామగుండం వీఆర్​లో ఉన్న భీమేశ్​​ను రామగుండం ఎస్​బీ సీఐగా నియమించారు. బదిలీ అయిన అధికారులు నూతన పోస్టింగుల్లో చేరాలని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులో పేర్కొన్నారు.