బతుకమ్మ, మాచారెడ్డి: కామారెడ్డి జిల్లా బీబీపేట లో ఈనెల 9న ఏడవ వార్షికోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ తెలిపారు. వార్షికోత్సవం లో ఉదయం ఏడు గంటలకు బీబీపేట హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో గణపతి హోమం, తదుపరి అష్టాభిషేకం, కలశ పూజ కార్యక్రమాలు శ్రీ ఉన్నికృష్ణ స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. భక్తులు, స్వాములు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులై తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ కోరింది.
