మద్నూర్, బతుకమ్మ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఘనంగా మహిళల దినోత్సవం జరుపుకున్నారు. ఉత్తమ ప్రతిభను కనబరిచిన మహిళలను సన్మానించి వారి సేవలను గుర్తు చేసుకున్నారు. మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాలకిషన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూరగాయలతో మహిళా చిత్రం చిత్రీకరించడంతో మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.