జుక్కల్, బతుకమ్మ:
జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా మరో అడుగు పడింది. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రత్యేక చొరవతో జుక్కల్ మండలంలోని సావర్గావ్ గ్రామంలో శుక్రవారం కొత్త ఆర్టీసీ బస్సు సర్వీస్ను ప్రారంభించారు. బాన్సువాడ డిపోకు చెందిన ఈ బస్సు కండెబలూర్ – సావర్గావ్ – విఠల్వాడి మార్గంలో కంగ్టి వరకు నడుస్తూ ప్రయాణికులకు సేవలు అందించనుంది. ఈ కొత్త బస్సు సర్వీస్ ద్వారా విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు తమ గమ్యస్థానాలకు సులభంగా చేరుకునే అవకాశం కలుగుతుందని ఎమ్మెల్యే తెలిపా రు.గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ కల్పించడం, ప్రజల రవాణా ఇబ్బందులను తగ్గించడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ బస్సు సర్వీస్ ప్రారంభంతో పరిసర గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. చిరకాలంగా బస్సు సౌకర్యం కోసం ఎదురుచూస్తున్న సావర్గావ్, పరిసర గ్రామాల ప్రజలు తమ కోరిక నెరవేరినందుకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు కృతజ్ఞతలు తెలిపారు.
