బతుకమ్మ, వేల్పూర్ :-భీంగల్ మండలానికి చెందిన అంకం జ్యోతి ఫౌండేషన్ సిఈఓ జ్యోతి సంతోష్ కుమార్ పుట్టాల మారుతి అన్నపూర్ణ కు వర్డ్ స్వచ్ఛంద సంస్థ కో- ఆర్డినేటర్ లావణ్య వారికి సమాచారం అందించగా 2025 నూతన సంవత్సరం సందర్భంగా వేల్పూర్ మండలం కుకునూర్ గ్రామానికి చెందిన ఆరాధ్య కు వంట సరుకులు, బట్టలు,డ్రై ఫ్రూట్స్ గురువారం అందజేశారు.ఈ సందర్బంగా అంకం జ్యోతి ఫౌండేషన్ సిఈఓ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఈ పాపకు లండన్ లో ఉంటున్న పార్వతి రెడ్డి గత కొన్ని నెలల నుండి ఈ పాప కి కావాల్సిన వంట సరుకులు, బట్టలు,డ్రై ఫ్రూట్స్ అందించడం జరుగుతుందని అంకం జ్యోతి ఫౌండేషన్ సిఈఓ. తెలిపారు.ఈ పాపకు అన్ని విధాలుగా తోడుగా ఉంటూ తమకు తోచినంత సహాయం అందిస్తున్న మీ గొప్ప మనసుకు మన అంకం జ్యోతి ఫౌండేషన్ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు..ఈ కార్యక్రమంలో అంకం జ్యోతి ఫౌండేషన్ సభ్యులు, లావణ్య తదితరులు పాల్గొన్నారు
