29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

రేపు యథాతథంగా బీసీ సంఘాల సభ

Must read

📰 Generate e-Paper Clip

  • ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఇందిరా పార్క్ వద్ద సభ
  • సభకు అనుమతి జారీచేసిన పోలీసు శాఖ

నిజామాబాద్, బతుకమ్మ  :  బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ సంఘాల సభ శుక్రవారం యథాతథంగా నిర్వహిస్తున్నట్లు బీసీ సంఘాల నాయకులు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4గంటల వరకు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సావిత్రి బాయి పూలే జయంతి రోజున నిర్వహించే బీసీ మహా సభకు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అయితే బీసీ మహా సభపై సాయంత్రం వరకు ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం 6గంటల వరకు పోలీసు శాఖ అనుమతి లభించక పోవడంతో ప్రభుత్వ తీరుపై బీసీ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. బీసీ మహా సభ నిర్వహణకు పోలీసు శాఖ నుండి అనుమతి లభించడంతో ఉత్కంఠకు తెరపడింది.

More articles

Latest article