ఎల్లారెడ్డి,బతుకమ్మ : ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మహిళ రైలు ప్రమాదంలో మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన ముత్తి సారిక (24) తాండూరు వెళ్లింది. తిరిగి తాండూర్ నుంచి రైలులో వచ్చి సనత్ నగర్ రైల్వే స్టేషన్ లో దిగింది. రైల్వే ప్లాట్ పాంపై నడుస్తుండగా ఆమె భూజానికి ఉన్న లగేజీకి ఎంఎంటీఎస్ రైలు తగలింది. దీంతో ఆమె కింద పడి తల పగిలి మృతి చెందింది. మంగళవారం ఆమె అంత్యక్రియలు ఎల్లారెడ్డిలో నిర్వహించారు.
