27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ట్రంప్ దిష్టిబొమ్మ దహనం 

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  వెనిజులాపై అమెరికా దాడికి నిరసనగా సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నాయకులు ట్రంప్ దిష్టిబొమ్మ దహనం  చేశారు. ఈసందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి  ఏ రమేష్ బాబు మాట్లాడారు. వెనుజులాపై దాడి చేసి ఆ దేశాధ్యక్షుడు మదురో, అతని భార్యను అక్రమంగా న్యూయార్కు తరలించడాన్ని ఖండించారు. ఇందుకు వ్యతిరేకంగా  ధర్నా చౌక్ లో నిరసన తెలిపారు.  ఆ దేశంలోని వివిధ పట్టణాల్లో బాంబుదాడులు జరిపి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందని ఆయన విమర్శించారు. అదేవిధంగా  ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా వైఖరిని ఖండించి వెనుజులకు అండగా నిలబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో  సీపీఎం  జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్ జిల్లా కమిటీ సభ్యులు సుజాత, నగర కమిటీ సభ్యులు నల్వాల నరసయ్య, అనసూయ, మరియు నగర నాయకులు అంజయ్య, శంషుద్దీన్, అబ్దుల్, రాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article