- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీ అరవింద్
బాల్కొండ, బతుకమ్మ : ముప్కాల్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ ముస్కు భూమేశ్వర్, తాజా మాజీ ఎంపీపీ భర్త లింగా గౌడ్ తమ అనుచరులతో శుక్రవారం ఎంపీ ధర్మపురి అరవింద్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎంపీ అరవింద్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్. ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయకుడు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

