బతుకమ్మ కోటగిరి – అదనపు కట్నం కోసం వేధించిన ముగ్గురి పై గృహహింస చట్టం కింద కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై సునీల్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పోతంగల్ మండలం సుంకిని గ్రామానికి చెందిన కబీర్ సంధ్య అనే మహిళా తన భర్త రాజేష్, అత్త గంగుబాయి, మామ బాలాజీ లు నిత్యం అదనపు కట్నం కోసం వేధించడంతోపాటు ఇంట్లో నుండి వెళ్లగొట్టారని ఫిర్యాదు చేయగా ఆమె భర్త కుటుంబీకులు అయిన ముగ్గురిపై గృహహింస చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
