ప్రజలందరికీ హనుమంతుడి అనుగ్రహం లభించాలి

0 4,154

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

  హైదరాబాద్‌, బతుకమ్మ :  రాష్ట్ర ప్రజలందరికీ హనుమంతుడి అనుగ్రహం లభించాలని కోరుకున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు  కవిత ప్రత్యేక పూజలు చేశారు. పూజ అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు కవితకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈసందర్భంగా కవిత రాష్ట్ర ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. హనుమంతుని దయతో ప్రతి ఒక్కరి జీవితాలు విజ్ఞానంతో నిండి ఉండాలని ఆకాంక్షిస్తున్నానని  పేర్కొన్నారు.

May all people receive the blessings of Lord Hanuman

Leave A Reply

Your email address will not be published.