నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఇటీవల నిజామాబాద్ నూతన సీపీ గా బాధ్యతలు స్వీకరించిన సాయి చైతన్యను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలో శాంతిభద్రతలు, ఇతర సమస్యల గురించి చర్చించారు, ఆయనతోపాటు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి పాల్గొన్నారు.
