మెండోరా, బతుకమ్మ :
మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామ శివారులో 46 కింటళ్ళ బియ్యం పట్టుకున్నట్లు మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు. నమ్మదగిన సమాచారంతో అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యంను పట్టుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. నిందితులు బాల్కొండ కి చెందిన వినీష్, నిర్మల్ కి చెందిన సుఫియన్ లు గా గుర్తించినట్లు వెల్లడించారు. వాహనంలో సుమారు 46 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
