23.7 C
Hyderabad

ఉగాది నిమిత్తంగా మహిళల పసుపు కుంకుమ కార్యక్రమం

Must read

📰 Generate e-Paper Clip

 

ముంబై, బతుకమ్మ :

 

ముంబై మహా నగరంలో “పార్లే బంగారు బతుకమ్మ మండల్” ఆధ్వర్యంలో పరాభవ నామ ఉగాది నూతన సంవత్సరం పురస్కరించుకొని మహిళలు పసుపు కుంకుమ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇందిరానగర్ చాల్ నం:2 లో నివసించే తెలుగు, తెలుగేతర స్త్రీలందరు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం.  కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విలేపార్లే వార్డ్ నం:70 నగర్ సేవక్ అనీష్ నవల్ మక్వాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకీ గుడిపాడ్వా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరు కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో ఉండాలని వారు కోరారు. తెలుగువారి ఉగాది కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉందనన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక స్త్రీలతో పాటు చుట్టూ ప్రక్కన ఇందిరా నగర్ తదితర ఏరియాల్లో నివసించే స్త్రీలు పాల్గొని విజయవంతం చేశారు. అలాగే స్థానిక ప్రముఖ రాజకీయ నాయకులైన హేమంగ్ జంగల, చిత్రేష్ మూలాజీ, తప్పన్ మేత తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article