బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఒకేషనల్ కోర్సులు ఎంపిహెచ్ డబ్ల్యు, ఎమ్ ఎల్ టి, కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ద్వితీయ సంవత్సరం విద్యార్థినిలు శిక్షణ నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రి, కంప్యూటర్ ల్యాబ్ కు కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, కళాశాల ప్రిన్సిపాల్ అసద్ ఫారూఖ్ ఆధ్వర్యంలో శుక్రవారం బయలుదేరారు. ఈ సందర్భంగా నోడల్ అధికారి షేక్ సలాం మాట్లాడుతూ.. ట్రైనింగ్ ద్వారా ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకుని భవిష్యత్తులో మెరుగైన అవకాశాలను పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి షేక్ సలాం, కళాశాల ప్రిన్సిపాల్ అసద్ ఫారూఖ్, ఒకేషనల్ అధ్యాపకులు కీర్తి,పవార్ క్రాంతి, వైశాలి పాల్గొన్నారు.
