గాలికుంటూ వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా ఇప్పించాలి

0 8,144

 

. . . డోన్గాం సర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్

 

జుక్కల్, బతుకమ్మ :

 

మూగజీవాలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను తప్పనిసరిగా వేయించాలని డోన్ గాం గ్రామసర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్ అన్నారు. జుక్కల్ పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉచిత టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించి, పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు. ఆవులు, దూడలు, బర్రెలు, గేదెలతో పాటు ఆయా రకాల మూగ జీవాలను గాలికుంటు వ్యాధి నుంచి రక్షించవలసిన అవసరం మన అందరిపై ఉందని, పశువైద్య శాఖ ద్వారా ఏప్రిల్ 9 వరకు గ్రామాల వారిగా కొనసాగే ఈ టీకాల కార్యక్రమాన్ని పశువుల పెంపకందారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ అన్నారు. పాడి రైతులు తప్పనిసరిగా తమ పశువులకు టీకాలు వేయించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యులతో పాటు గోపాల మిత్రలు రాములు, అంజయ్య, రవీందర్, పాడి రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.