29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన అర్బన్ ఎమ్మెల్యే

Must read

📰 Generate e-Paper Clip

. . . నగర అభివ్రద్ధే లక్ష్యం – ఎమ్మెల్యే ధన్ పాల్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ అర్బన్ అభివృద్ధే లక్ష్యంగా రోడ్లు, డ్రైనేజీ ఇతర అభివృద్ధి పనులకు భూమి పూజలు చేసినట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. టి యు ఎఫ్ ఐ డి సి పథకం ద్వారా నగరంలోని 19 డివిజన్ పరిధిలోని రోడ్ నెంబర్ 5 లో భూమి పూజ నిర్వహించినట్లు ఆయన అన్నారు. అదేవిధంగా 20 డివిజన్ ఎల్లమ్మ గుట్ట, 36వ డివిజన్ నాందేవ్ వాడ, 34 వ డివిజన్ మిర్చి కాంపౌండ్, 49వ డివిజన్ శ్రీదేవి టాకీస్ రోడ్డు, 50 డివిజన్ పరిధిలోని గురుద్వార్ దగ్గర, 27వ డివిజన్ పరిధిలోని వర్ని చౌరస్తా ప్రాంతాల్లో, 8 వ డివిజన్ పరిధిలోని బంగారు మైసమ్మ గుడి మరియు సాయి నగర్ రోడ్ నెంబర్ 2, 46వ డివిజన్ పరిధిలోని ముదిరాజ్ గల్లీ ( పోచమ్మ గల్లి ), 44వ డివిజన్ పరిధిలోని ఖలీల్ వాడి ప్రాంతాల్లో భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ నగర అభివృద్ధి లక్ష్యంగా తన నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన రోడ్లు, నాణ్యమైన డ్రైనేజీ వ్యవస్థ, స్ట్రీట్ లైట్ల ఏర్పాటుకు ఈ ప్రత్యేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో అర్బన్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి పనులను చూసి స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలలో పబ్లిక్ హెల్త్ డిఇ, ఇంచార్జ్ మునిసిపల్ నగేష్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఎఈ లు శివకృష్ణ, శంకర్ పాల్గొన్నారు.

 

Urban MLA performs Bhoomi Puja for various development works
Urban MLA performs Bhoomi Puja for various development works
Urban MLA performs Bhoomi Puja for various development works
Urban MLA performs Bhoomi Puja for various development works

More articles

Latest article