మద్నూర్, బతుకమ్మ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం మద్నూర్ పోలీస్ స్టేషన్లో మహిళా సిబ్బందిని ఎస్సై విజయ్ కొండ సన్మానించారు. సమాజాన్ని తీర్చిదిద్దడంలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో మహిళల బలం కుటుంబాలకే కాదు ఎదుగుతున్న దేశానికి కూడా మహిళలు వెన్నుముక వంటి వారిని ఎస్సై అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.
