. . . డ్రైవర్ కు స్వల్ప గాయాలు
రుద్రూర్, బతుకమ్మ :
సిమెంట్ లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన శనివారం రుద్రూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. రుద్రూర్ మండలంలోని జేయన్సీ కాలనీ వద్ద సిమెంటు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయని, చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.
