బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని సిద్ధరామేశ్వర నగర్ గ్రామంలో దొంగలు బీభత్సం చేశారు. బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం 20 తులాల వెండి మూడు తులాల బంగారం 1,30,000 నగదు చోరీ అయినట్లు తెలిపారు. భిక్కనూరు ఏఎస్ఐ జగదీష్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన చేరుకొని పరిశీలించారు.
