26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసిన రుద్రూర్ పద్మశాలి సంఘం సభ్యులు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో గల పద్మాశాలి సంఘం అధ్యక్షులు గెంటల సాయిలు,  కార్యదర్శి కార్తీక్, ఆధ్వర్యంలో  పద్మాశాలి సంఘం సభ్యులు శుక్రవారం బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘ భవన నిర్మాణంకు సంబందించిన బిల్లు సమస్యను విన్నవించారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించి ఇచ్చిన మాట ప్రకారం పద్మశాలి భవన నిర్మాణా బిల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా సంఘ సభ్యులు  ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో పద్మశాలి సంఘ అధ్యక్షులు గేంటిల సాయిలు, కార్యదర్శి గుద్దేటి వార్ కార్తీక్,మౌత్కూరి సాయినాథ్,తాటిపాముల విజయ్, పిడుగు శంకర్, చిక్కడపల్లి రవి, పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు.

More articles

Latest article