. . . రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ చూపిన శెట్ పల్లీ విద్యార్థులు
మోర్తాడ్, బతుకమ్మ :
ప్రతి విద్యార్థిలో ప్రతిభ దాగి ఉంటుందని సరైన క్రమంలో తర్ఫీదు ఇస్తే ఆణిముత్యాలుగా తీర్చిదిద్దవచ్చని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య అన్నారు. మెట్ పల్లి లో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపించారని ఆయన పేర్కొన్నారు. నవ్య శ్రీ, రితిక లు మొదటి బహుమతి, ప్రణవి, దీపిక లు ద్వితీయ బహుమతి, అలాగే నవ్య శ్రీ, పెడతానపల్లి నవ్య శ్రీ, శశివర్ధని తృతీయ బహుమతి సాధించారని తెలియజేశారు. పాఠశాల విద్యార్థులు బహుమతులు సాధించడంతో మిఠాయిలు పంచి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ శివాని, పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

