27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

 చికిత్స పోందుతు హోంగార్డు మృతి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలిస్ హెడ్ క్వార్టర్ లో హోంగార్డుగా పని చేస్తున్న చిన్నయ్య (39) చికిత్స పోందుతు మృతి చెందాడు. ఈ నెల 16న తన ఇంటివద్ధ యాసీడ్ తాగిన చిన్నయ్యను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం  జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పోందుతు మరణించాడు. చిన్నయ్య అత్మహత్యకు పాల్పడ్డారా లేక  మద్యం మత్తులో నీళ్లు అనుకుని యాసీడ్ తాగాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు ఆరవ టౌన్ పోలిస్ లు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article