. . . జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావు
కామారెడ్డి, బతుకమ్మ :
ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఎంతో తోడ్పాటును అందిస్తుందని డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు. మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్ హాల్లో బుధవారం షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథులుగా పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం మండలంలోని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


