. భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద నిలిచిపోయిన బస్సు
. ప్రయాణికుల ఇబ్బందులు
భిక్కనూరు, బతుకమ్మ : బోధన్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో డీజిల్ అయిపోవడంతో భిక్కనూరు టోల్ ప్లాజా సమీపంలో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డీజిల్ లేకుండా బస్సులు నడుపుతున్నారని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రశ్నిస్తే డ్రైవర్ తమతో దురుసుగా ప్రవర్తించాడని ప్రయాణికులు వాపోతున్నారు. జీఎంఆర్ పెట్రోలింగ్ వాహనం పైలెట్ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని గ్రహించి డీజిల్ తీసుకువచ్చారు. సంబంధిత అధికారులు బస్సు డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

