నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టీజీవో అధ్యక్షులు అలుక కిషన్, ప్రధాన కార్యదర్శి అమ`త్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ను కలిసి గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పేదల కోసం టీజీవో తరపున 200 బ్లాంకెట్లను అందజేశారు. టీజీవో తో కలిసి పని చేయడానికి ఎల్లప్పుడు జిల్లా కలెక్టర్ కు అందుబాటులో ఉంటామని తెలిపారు. టీజీవో సేవలను ఈసారి మరింత విస్తరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ ప్రెసిడెంట్ జలగం తిరుపతిరావు, కోశాధికారి దేవిసింగ్, గౌరవ సభ్యులు డా.నాగమోహన్, యోహాన్, పావని, చందర్, జిల్లా విద్యాశాఖాధికారి అశోక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి రమేష్ తదితరులున్నారు.
