ఆలయాలకు పోటెత్తిన భక్తులు
వెబ్ న్యూస్, బతుకమ్మ : మహా శివరాత్రి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు బుధవారం వేకువ జాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం, వేములవాడ, కీసర తదితర ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు.



