ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నందు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటో కి పుష్పగుచ్చాల ను సమర్పించారు. కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఈ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తిలో కంటే గౌరవప్రదమైనది గొప్పది అని తెలిపారు. విలువలతో కూడిన విద్యను అందించి విద్యార్థులు మంచి బాటలో వారికి క్రమశిక్షణ నేర్పిస్తూ గొప్ప స్థానాల్లో ఉంచడమే ఉపాధ్యాయుల ముఖ్య లక్షణం అని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ చంద్రకాంత్, ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ వి.శంకరయ్య, టీఎస్ కే సి ఇన్చార్జ్ శివకుమార్, సైన్స్ ఇన్చార్జ్ బి అరుణ్ కుమార్, నాగ నిక, ఎస్ చంద్రకాంత్, రాణి, డా.గోదావరి, కళాశాల సూపరిండెంట్ వసంతలక్ష్మి, డాక్టర్ సిద్దురాజ్, డాక్టర్ గంగారెడ్డి, కృష్ణ ప్రసాద్, సంతోష్, మెయిన్, స్వప్న, సురేశ్ రెడ్డి, కిరణ్ కుమార్, దశరథ్, సంగీత,వరుణ్ రాజ్ సీనియర్ అసిస్టెంట్, అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
