ఇందల్వాయి, బతుకమ్మ: ఇందల్వాయి మండల కేంద్రంలోని చంద్రాయన్ పల్లి గ్రామానికి చెందిన తూర్పు రాజన్న అనే వ్యక్తి కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ మనోజ్ తెలిపారు. మరణించిన వ్యక్తిని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్య పిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు.
