బతుకమ్మ, భిక్కనూరు: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు హెచ్చరించారు. ఆదివారం భిక్కనూరు టోల్ ప్లాజా సమీపంలో నేషనల్ హైవేపై వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భిక్కనూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
