నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని బ్యాంక్ కాలనీలో శ్రీ శ్రీ శ్రీ గణేష్ మండలి వద్ద వినాయక లడ్డూ వేలం బ్యాంక్ కాలనీ సభ్యులు నిర్వహించారు. పోటా పోటీగా సాగిన వేలం పాటలో కాపర్తి సాయి కృష్ణ రూ.1,31,111 లకు లడ్డూ దక్కించుకున్నాడు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ కాలని సభ్యులు, యోగానంద రెడ్డి, శశిధర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, సంజయ్ పాల్గొన్నారు.