. . . కళ్యాణ మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే
ఇందల్ వాయి, బతుకమ్మ :
ఇందల్ వాయి లో సీతారామ చంద్ర స్వామి కల్యాణ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి హాజరయ్యారు. శ్రీ రామ నవమి సందర్భంగా భక్తజన సందోహం నడుమ, వేద పండితుల మంత్రోచ్ఛారణలతో సీత రాముల పెండ్లి వేడుకను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకను కన్నులారా చూసేందుకు గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో సీతారాముల ఆలయా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రంగు రంగుల లైట్లలో ఆలయాన్ని అలంకరించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ మహేందర్, వైస్ చైర్మన్ రఘుపతి, సభ్యులు గ్రామ సర్పంచ్ లోకని గంగామణి గంగారం, ఉప సర్పంచ్ మోత్కూరి శ్రీనివాస గౌడ్, గ్రామ ప్రముఖులు, వేద పండితులు కందాలై రాజగోపాల చారీ, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

