నిజామాబాద్, బతుకమ్మ : మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 25 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాలతో మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ట్రాఫిక్ ఎస్ఐ వంశీ కృష్ణ తెలిపారు. అనంతరం వీరిని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జా హాన్ ఎదుట హాజరుపర్చామని పేర్కొన్నారు. ఇందులో ఏడుగురికి వారం రోజుల పాటు జైలు శిక్ష, 17 మందికి ఒకరికి రూ. 10,000 చొప్పున, మరొకరికి రూ. 11000 చొప్పున సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జా హాన్ జరిమానా విధించారని ఆయన వెల్లడించారు.
