బతుకమ్మ, ఏర్గట్ల : మాదిగ ఎస్సి సంఘానికి లక్షా 50 వేల రూపాయల ఎస్డిఎఫ్ నిధులతో బోర్ వేయించారు. ఏర్గట్ల గ్రామానికి చెందిన మునిమాణిక్యం లక్ష్మి కి సిఎంఆర్ఎఫ్ చెక్కు అందజేశారు. ఈ నిధులకు సహకరించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు ఎస్సీ మాదిగ సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిధులు రావడానికి కృషిచేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి, గడ్డం జీవన్ రెడ్డి, ముస్కు మోహన్ రెడ్డి, బద్దం లింగారెడ్డి, పన్నాల నర్సరెడ్డి,బద్దం జితేందర్ రెడ్డి, దోబ్బల చిన్న కిషన్,జుంగల గణేష్,సంగెం గంగాధర్, రాజారాం సహదేవ్,కారు పాకల నరసయ్య, ఆరపు మాణిక్యం,దండ బోయిన ఆశన్న,జుంగల శ్రీను,కనుగుర్తి ఉషన్న,సలీం,రషీద్,లు పాల్గొన్నారు.
