వేల్పూర్, బతుకమ్మ : మండలంలోని మోతె హైస్కూల్ లోని మాథ్స్ టీచర్ కృష్ణవేణి, కుక్ నూర్ హై స్కూల్ డిప్యూటేషన్ పూర్తి అయిన హిందీ పండిత్ టీచర్ శ్రీనివాస్ రావు లకు మంగళవారం వీడుకొలు కార్యక్రమం ను నిర్వహించారు. వేర్వేరు గా నిర్వహించిన ఈ వీడుకొలు కార్యక్రమాల్లో భాగంగా మోతె మాథ్స్ టీచర్ కృష్ణవేణి హెడ్ మాస్టర్ పదోన్నతితో బదిలీ పై వెళ్తుండగా ఆమెను ఘనంగా సన్మానించారు. కుక్ నూర్ స్కూల్ లో డిప్యూటేషన్ పై హిందీ పండిత్ గా పని చేస్తున్న శ్రీనివాసరావు డిప్యూటేషన్ కాల పరిమితి ముగియడం తోసేమ్ ప్లేస్ కు వెళ్తున్న ఆయనకు సన్మానం చేసి వీడుకొలు పలికారు. ఈ వేర్వేరు కార్యక్రమాల్లో వేల్పూర్ మండలం పిఆర్టియు ప్రధాన కార్యదర్శి సి వి నరసింహారావు,ఉపాధ్యాయులు మంచే గణేష్ మహేందర్ రత్నయ్య శ్రావణ, శ్రీ కవిత, మంచిర్యాల సురేష్, జడ్పిహెచ్ఎస్ కిసాన్ నగర్ ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారిణి రేణుక, కుక్నూర్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు టి.హరిచరణ్, ఉపాధ్యాయ బృందం పతాని గంగాధర్,జి. రవీంధర్, శ్రీధర్ రావు, చరణ్ దాస్, మల్కన్న నాగరాజు, అశోక్,శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

