నిజామాబాద్ అర్బన్ , బతుకమ్మ :
నగరంలోని సుభాష్ నగర్ నారాయణ స్కూల్ లో శనివారం సైన్స్ ఫేర్ విద్యార్థులు, తల్లిదండ్రులు, సందర్శకులతో ఉత్సాహంగా సాగింది. 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యార్థులు గణితం, సైన్స్, పర్యావరణ అంశాలపై మోడళ్లు, ప్రయోగాలు ప్రదర్శించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక ఆసక్తితో తిలకించి ప్రశ్నలు అడుగుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్య అతిథిలుగా ఏజీఎం శివాజి పటేల్, సూర్యవంశీలు హాజరయ్యారు. వారితో జెడ్సీఓలు రాకేష్ సర్ (హైస్కూల్), అజీమా మేడమ్ (ఈ-ఛాంప్స్), కల్పన మేడమ్ (ఈ-కిడ్జ్), ప్రిన్సిపాల్, సిబ్బంది పాల్గొన్నారు. అతిథులు విద్యార్థుల వివరణలు విని వారి ప్రయత్నాలను అభినందించారు. సందర్శకులు ప్రయోగాల్లోని కొత్తదనాన్ని, విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకున్నారు. ప్రశ్నాత్మక అభ్యాసాన్ని ప్రోత్సహిస్తూ సైన్స్ ఫేర్ విజయవంతంగా ముగిసింది. ఇది పాఠశాల విద్యలో ప్రయోగాత్మక అభ్యాస దృష్టిని బలపర్చింది.

