- కామారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మినుకూరి బ్రహ్మానందరెడ్డి
- అక్షయ తృతీయ సందర్భంగా అన్నదానం
కామారెడ్డి, బతుకమ్మ : అక్షయ తృతీయ పురస్కరించుకొని కామారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బ్రహ్మానంద రెడ్డి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసపత్రి వద్ద అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే కలిసి వస్తుందని చాలామంది డబ్బున్న వ్యక్తులు బంగారాన్ని కొనుగోలు చేస్తారని, అలా కాకుండా పది మందికి అన్నదానం చేస్తే వారి దీవెనలే బంగారంగా ఉంటుందని భావించి బుధవారం ఇక్కడ అన్నదానం చేయడం జరిగిందన్నారు. సేవ చేయడంలోనే తృప్తి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మినుకూరి స్రవంతి, సిద్ధంశెట్టి వేణు, శ్వేత, ఇందూరి రేవతి తదితరులు పాల్గొన్నారు.

