29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి

Must read

📰 Generate e-Paper Clip

– కేజీబీవీ పాఠశాలను తనిఖీ నిర్వహించిన జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్

రుద్రూర్, బతుకమ్మ : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని  జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్  అన్నారు. ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ  పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్  ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. అదేవిధంగా పాఠశాలలో పలు రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధనతో పాటు మెనూ ప్రకారం భోజనం అందించాలని  అక్కడ ఉన్న సిబ్బందికి సూచించారు. ఆయన వెంట  కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపాల్ శ్యామల  తదితరులు ఉన్నారు.

More articles

Latest article