కామారెడ్డిలోని ఆశోక్ నగర్ కాలనీలో ..
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి పట్టణంలోని ఆశోక్ నగర్ లో కాలనీవాసులు గుంతల రోడ్లలో నీరు నిలువడంతో సోమవారం వరినాట్లు వేసి నిరసన తెలిపారు. గుంతల రోడ్లకు మరమ్మతులు చేయాలని ఈసందర్భంగా కాలనీవాసులు డిమాండ్ చేశారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

