రుద్రూర్, బతుకమ్మ: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలను బుధవారం రుద్రూర్ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల ఇంచార్జ్ గాండ్ల మధు, దౌర్ సాయిలు, బొట్టే గజేందర్, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
