వెబ్ న్యూస్, బతుకమ్మ : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదని సోమవారం నుంచి ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు సమ్మె బాట పట్టాయి. ఈ నెల 21,22వ తేదీల్లో 10 లక్షల విద్యార్థులతో హైదరాబాద్లో మహాధర్నా చేపడతామని, దసరా లోపు రూ.1,200 కోట్ల బకాయిలు చెల్లిస్తేనే సమ్మె విరమిస్తానని విద్యా సంస్థల సంఘాల నాయకులు తేల్చి చెప్పారు. ఆదివారం అర్ధరాత్రి 12:30 గంటల వరకు ప్రభుత్వ అధికారులతో కళాశాల యాజమాన్య సంఘాలు చర్చలు జరిపారు. చర్చలు విఫలం కావడంతో, డిమాండ్లు నెరవేర్చేవరకు కళాశాలలు బంద్ పాటిస్తాయని ఉన్నత విద్యాసంస్థల సంఘాల నేతలు పేర్కొన్నారు.
